బీహార్లో బీజేపీ బంద్ ఉద్రిక్తం
పాట్నా,(జనంసాక్షి): జేడీయూ తీరును నిరసిస్తూ బీహార్లో బీజేపీ చేపట్టిన బంద్ ఉద్రిక్తలకు దారి తీసింది. బంద్ సందర్భంగా బీజేపీ-జేడీయూల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బంద్ సందర్భంగా వాణిజ్య వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీజేపీ నుంచి జేడీయూ తప్పుకున్న విషయం తెలిసిందే.