బెంగళూరులో కొనసాగుతున్న ఆందోళనలు

weakbtn1బెంగళూరులో ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతికి నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలతోపాటు ఏబీవీపీ కూడా నిరసనలు ఉధృతం చేసింది. అధికారి మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించే వరకు ఆందోళన విరమించబోమని బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు స్పష్టంచేశారు. ఈ మేరకు అసెంబ్లీ నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీగా వెళ్లి.. గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు. కాగా ఏబీవీపై ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.