బెంగళూరు సిటీ సెంటర్‌లో భద్రత కట్టుదిట్టం

బెంగళూరు : బెంగళూరులో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ కారులో నలుగురు ఉగ్రవాదులు బెంగళూరు సిటీలోకి వచ్చారని, దాడులకు పాల్పడవచ్చని కేంద్ర నిఘాసంస్థల నుంచి అధికారులకు సమాచార మందింది. దీంతో సిటీ సెంటర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.