బెంగాల్ ప్ర‌జ‌లు అధికార‌ తృణ‌మూల్ కాంగ్రెస్‌కే మ‌ద్ద‌తు

 కోల్‌క‌తా : ప‌శ్చిమ బెంగాల్‌లో ఎగ్జిట్ పోల్స్ త‌ల‌కిందులు అయ్యాయి. బెంగాల్ ప్ర‌జ‌లు అధికార‌ తృణ‌మూల్ కాంగ్రెస్‌కే మ‌ద్ద‌తు తెలిపారు. మొత్తం 42 స్థానాలు ఉన్న బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ 18 స్థానాల్లో లీడ్‌లో ఉంది. బీజేపీ కేవ‌లం మూడు స్థానాల్లో మాత్ర‌మే ఆధిక్యంలో కొన‌సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానానికే ప‌రిమిత‌మైంది. ఇత‌రులు మిగ‌తా స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోన్నారు.

బెంగాల్‌లో బీజేపీనే అత్య‌ధిక స్థానాలు గెలుస్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్ల‌డైన సంగ‌తి తెలిసిందే. ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం.. బీజేపీ 26 -31 స్థానాల్లో గెలుస్తుంద‌ని వెల్ల‌డైంది. టీఎంసీ 11 నుంచి 14 స్థానాల్లో గెలిచే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డైంది.

2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ 18 స్థానాల్లో, టీఎంసీ 22 స్థానాల్లో గెలుపొందింది. ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు త‌ల‌కిందులు అవుతాయ‌ని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సోమ‌వారం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.