బొగత జలపాతంలో ఇద్దరు గల్లంతు

జయశంకర్‌ భూపాలపల్లి,మే17(జ‌నం సాక్షి ):  జిల్లాలోని వాజేడు మండలంలోగల బొగత జలపాతంలో మునిగి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. హన్మకొండకు చెందిన చెందిన సతీష్‌(35), హర్షిత్‌రెడ్డి(11) అనే వారు బొగత జలపాతం అందాలను తిలకించేందుకు వెళ్ళారు. అయితే ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతిచెందడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చిన వారు విగత జీవులుగా పడి ఉండడాన్ని చూసి వారి కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది.