బొగ్గు కుంభకోణానికి ప్రధాని బాధ్యత వహించాలి: ప్రకాశ్‌ జవదేకర్‌

న్యూఢిల్లీ, (జనంసాక్షి): బొగ్గు కుంభకోణానికి స్వయంగా ప్రధాని బాధ్యత వహించాలని భాజపా నేత ప్రకాశ్‌ జవదేకర్‌ డిమాండ్‌ చేశారు. 147 సంస్థలకు అప్పనంగా బొగ్గు క్షేత్రాలను కట్టబెట్టారని ఆయన మీడియాతో మాట్టాడేతూ ఆరోపించారు. ఎంపీ నవీన్‌ జిందాల్‌, మాజీ మంత్రి దాసరి నారాయణరావు నివాసాల్లో సీబీఐ సోదాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు అశ్వనీకుమార్‌ ఎలా ప్రయత్నించారో అందరికీ తెలుసని అన్నారు.