బ్యాంకు సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య

ఏటూరునాగారం :  వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో ఓ వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కెనరా బ్యాంకు శాఖలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సురేందర్‌రెడ్డి ఇంటి వద్దే పురుగుల ముందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.