బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

న్యూఢిల్లీ : పాక్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత జట్టులో స్వల్ప మార్పులు చేశారు సెహ్వాగ్‌, దిండా స్థానంలో రహానే, షమీ అహ్మద్‌లకు చోటు కల్పించారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు నెగ్గి సీరీస్‌ను పాక్‌ కైవసం చేసకోగా.. చివరి మ్యాచ్‌లో నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని టీం ఇండియా చూస్తోంది.