భక్తిప్రపత్తులతో అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వలు

 

 

 

 

పెద్దశేష వాహనంపై ఊరేగిన పద్మావతి

తిరుపతి,నవంబరు12(జ‌నంసాక్షి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులకు అనుమతి లేకున్నా కార్యక్రమాలను యధావిధిగా సాగిస్తున్నారు. ఉత్సవాల్లో

రెండో రోజైన గురువారం ఉదయం పెద్దశేషవాహనంపై వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు అలంకారంలో శంఖుచక్రాలు, గదతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియ జేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవ దర్శనం వల్ల యోగశక్తి కలుగుతుంది. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాల మొదటిరోజైన బుధవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు నవనీతకృష్ణుని అలంకారంలో చిన్నశేషవాహనంపై అభయమిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్‌-19 మార్గదర్శకాల మేరకు ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది. మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిచ్చారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి దర్శనం వల్ల యోగసిద్ధి చేకూరుతుందని నమ్మిక.