భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

-అద్వానీ గైర్హాజరు

పనాజీ: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు గోవాలో ప్రారంభమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు పనాజీ వేదికగా రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు పార్టీ అగ్రనేత అద్వానీ హాజరుకాలేదు. అనారోగ్య కారణాల వల్ల ఆయన హాజరుకాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రచార కమిటీ ప్రకటనపై రేపు జాతీయ కార్యవర్గం నిర్ణయం తీసుకోనుంది.