భాజాపా ప్రచార కమీటీ ఛైర్మన్‌గా మోడీ

పనాజీ : భాజాపా ప్రచార కమీటీ ఛైర్మన్‌గా గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నియమితులయ్యారు. ఈ మేరకు గోవా రాజధాని పనాజీలో జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నరేంద్ర మోడీ పేరును ఈ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 2014 సార్వత్రిక ఎన్నికల కమిటీకి మోడీ నాయకత్వం వహించనున్నట్లు భాజపా వెట్లడించింది.