భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడమే బిజెపి పార్టీ యొక్క లక్ష్యం: కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

ప్రపంచంలో భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడమే బిజెపి పార్టీ యొక్క లక్ష్యమని కార్పొరేటర్ మొద్దులచ్చిరెడ్డి  అన్నారు.     బి యన్ రెడ్డి నగర్ డివిజన్  జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి గారి* ఆధ్వర్యంలో మహిళా డివిజన్ ప్రధాన కార్యదర్శి భ్రమరాంబ సహకారంతో బిజేపి పార్టీ లో చేరిన పలు కాలనీ సభ్యులు. సందర్భంగా వారికి కాషాయ కండువా కప్పి  పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో చేరిన సభ్యులకు స్వాగతం పలుకుతూ, భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని శక్తివంతమైన, సౌభాగ్యకరమైన దేశంగా తీర్చిదిద్దడం, భారతదేశపు ఘనమైన ప్రాచీన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడం, దేశాన్ని అభివృద్ధిపథంలోకి పయనింపజేయడం, ప్రపంచంలో భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడమే బిజెపి పార్టీ యొక్క లక్షణమని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు పార్టీ కార్యక్రమాలలో పాల్గొని నాయకులుగా ఎదగాలని రాబోయే రోజులలో మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ముడుపు సందీప్ రెడ్డి, ఉపాధ్యక్షులు మెట్టుపల్లి సంతోష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఆది లక్ష్మి, నాయకులు పవన్ రెడ్డి మరియు
బీజేపీ పార్టీ లో చేరిన సభ్యులు రాములు, విక్రమ్, అంజనేలు, చిన్న, రసూల్, కిరణ్ రెడ్డి, బాషా, శ్రీకాంత్, సురేష్, మహిళా సభ్యులు వీరమని, నాగ మాని, భారతి, సుభలక్ష్మి, పార్వతీ, విజయ్ లక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు.