భారత్‌ చేరిన 24 మంది జాలర్లు

రామేశ్వరం: శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసిన 24 మంది జాలర్లు ఈరోజు భారత్‌ చేరుకున్నారు. శ్రీలంక జలాల్లోకి ప్రవేశించారన్న అరోపణలతో వీరిని జూన్‌ 5న అరెస్టు చేశారు. శ్రీలంక కోర్టు తీర్పు మేరకు వీరిని జులై 3న విడుదల చేశారు. జాలర్లు వారికి సంబంధించిన ఐదు పడవలతో సహా భారత్‌ చేరారని తీర ప్రాంత రక్షణ దళ అధికారులు వెల్లడించారు.