భారత జాలర్లను విడుదల చేసిన శ్రీలంక నౌకాదళం

తమిళనాడు,(జనంసాక్షి): శ్రీలంక నౌకాదళం ఇటీవల అరెస్టు చేసిన 49 మంది భారత జాలర్లను విడుదల చేసింది. రెండు రోజుల్లో వారు భారత్‌ రాబోతున్నారని తమిళనాడు ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఇందులో 24 మంది జాలర్లను మంగళవారం అనురాధపురం జైలు నుంచి విడుదల చేశారు. మరో 25 మందిని బుధవారం జాఫ్నా నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు. పాక్‌ జలసంధి సమీపంలో చేపల వేటకు వెళ్లిన మత్య్సకారులను జూన్‌ 5న రెండు వేర్వేరు చోట్ల అరెస్టు చేశారు.