భారత రత్న అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా అమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బడి పిల్లలకు బుక్స్ పెన్నులు పంపిణీ

ఆదిలాబాద్: ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం చిలుక లక్ష్మి  నగర్ లో ఉన్న ప్రైమరీ పాఠశాలలో  అమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  స్వాతంత్ర సమరయోధుడు స్వతంత్ర భారత మొదటి విద్యా శాఖ మంత్రి  భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా పిల్లలకు బుక్కులు పెన్నులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమందర్ గారు మాట్లాడుతూ అమన్ ఫౌండేషన్ చాలా మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటూ పేద ప్రజలకు సహకారం అందిస్తున్నారు అన్నారు.    పేద పిల్లలకు సాయం చేయాలని ఈరోజు ఎడ్యుకేషన్ డే సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు బుక్స్ లు పెన్నులు పంపినీ చెయ్యడం అభినందనీయమన్నారు అమన్ ఫౌండేషన్ చేసే కార్యక్రమాలకు ఎప్పటికి మా సహకారo ఉంటది అని అన్నరు . అదిలాబాద్ సీనియర్ పాత్రికేయుడు తవకుల్ గారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఎదగాలని దేశ సేవలో ఉండాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు మున్సిపల్ కౌన్సిలర్ నర్సింగ్ గారు ఎస్ఎంసి చైర్మన్ ఆసిఫ్ గారు ప్రిన్సిపల్ ఆసిఫ్ గారు గఅమర్ ఫౌండేషన్ అధ్యక్షుడు అర్ఫాద్ ఖాన్ పరమేశ్వర్ కోలెట్కర్ ,రాహుల్ గజ్బరే  అజీమ్ , తదితరులు పాల్గొన్నారు….