భిక్షాటనచేసిన అంగన్వాడీలు.. 19వ రోజుకు చేరుకున్న రిలేనిరాహార దీక్షలు.

భిక్షాటనచేసిన అంగన్వాడీలు.. 19వ రోజుకు చేరుకున్న రిలేనిరాహార దీక్షలు.

రాయికల్,సెప్టెంబర్ 30 (జనంసాక్షి)అంగన్ వాడి లను ప్రభుత్వ ఉద్యోగులుగా
గుర్తించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న
రిలే నిరాహారదీక్షలు
పంతొమ్మిదవ రోజు కు చేరుకుంది
సమ్మె శిబిరంలో బిక్షాటన చేసి నిరసన తెలిపారు ఈ నిరాహారదీక్షకు రాయికల్
కాంగ్రెస్ నాయకులు ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షులుమహమ్మద్ ముస్తాక్ అహ్మద్(మున్ను) మద్దతు తెలుపుతూ
ప్రభుత్వం ఎంత వేడుకున్నా స్పందించని ప్రభుత్వ తీరుకు నిరసిస్తూ నినాదాలు చేశారు
ఈ సందర్భంగా మున్ను మాట్లాడుతూఅంగన్వాడీ ఉద్యోగులను సుప్రీంకోర్టు ఆదేశానుసారం
పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని గ్రామంలో ఓటర్ల సర్వే, బాత్రూంల సర్వేల పేర్లతో మీటింగులు పెడుతూ ఇతర పనులకు అంగన్వాడీలను పరిమితం చేస్తూ విద్యార్థులకు చదువు చెప్పే సమయంలో చెప్పకుండా చేస్తూ
ఒకవేళ విద్యార్థుల హాజరు శాతం తగ్గితే విద్యార్థులు ఎందుకు రావడం లేదంటూ తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆన్ లైన్ మాధ్యమాలలో సమాచారాన్ని పొందుపరచుట కష్టంగా మారిందని వెబ్ సైట్ ల పనితీరు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని
కనీసం ప్రభుత్వం టిఎ.డిఎ లు కూడా ఇవ్వడం లేదని అవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం గుర్తించక
అన్యాయంగా అంగన్ వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టి ఇతరులకు భాద్యతలు అప్పగించడంతో మనోవేదకు గురు అవుతున్నామని
ప్రభుత్వాలు మా సమస్యల పట్ల తక్షణ పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు లావణ్య, రమాదేవి,మిట్టపెల్లి పద్మ, రాధ,రమ,ఉమాదేవి,రాజేశ్వరి,సుజాత,గోదావరి, బుజ్జమ్మ అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.