భివాండీ ప్రమాదంలో ఆరుకు చేరిన మృతులు

ముంబయి: ముంబయిలోని భివాండీలో రెండంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. శిథిలాల కింద గురువారం రాత్రి రెండు మృత దేహాలను, ఈరోజు ఉదయం ఒక మృతదేహాన్ని వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో కర్మాగారం కార్మికులు మహమ్మద్‌ మన్సూర్‌(22), మిరాజ్‌ షేక్‌ (30) ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో మొత్తం 24 మంది గాయపడ్డారు.