భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తా :మంత్రి మల్లారెడ్డి

 

 

 

 

 

 

 

శామీర్ పేట్, జనం సాక్షి : అంతాయ పల్లి భూ నిర్వసితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం అంతాయ పల్లి బాధిత రైతులు మంత్రి మల్లారెడ్డి నివాసనికి వెళ్లి వినతి పత్రం అంద జేశారు.అనంతరం
టీపీసీసీ సీనియర్ అధికార
ప్రతినిధి హరివర్ధన్ రెడ్డి ని రైతులు కలిసి వినతి పత్రం ఇవ్వగా మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, 15 రోజులు మంత్రి మల్లారెడ్డికి,కలెక్టర్ కి సమయం ఇద్దామని,లేనిపక్షంలో మీ తరఫున నేనే నిరాహార దీక్ష చేస్తానని మీ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు మీకు అండగా ఉంటానని,మీ అందరినీ అవసరమైతే టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా తీసుకువెళ్లి వారి ద్వారా కూడా మీ తరఫున పోరాటం చేసి మీకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
తూంకుంట,శామీర్ పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి ,యాష్కి శంకర్ గౌడ్ ,బాధిత రైతు కుటుంబాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
12ఎస్పీటీ -1: బాధిత రైతులతో మంత్రి మల్లారెడ్డి