భూ వివాదాల్లో వ్యక్తి హత్య

వరంగల్: వరంగల్ జిల్లా మద్దూర్ మండలం బైరాన్‌పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదాలతో తన చిన్నాన్నను ఈశ్వరయ్య(35) అనే ఓ యువకుడు కర్రతో కొట్టి చంపాడు. మృతుడు లింగయ్య(72) విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. హత్య అనంతరం నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు