భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీలో రెండు కోట్ల 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న దుకాణ సముదాయం ( షాపింగ్ కాంప్లెక్స్ ) నిర్మాణం

భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీలో రెండు కోట్ల 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న దుకాణ సముదాయం ( షాపింగ్ కాంప్లెక్స్ ) నిర్మాణం

భూమి పూజ చేసిన నిర్మల్ జిల్లా బిఆర్ స్ అధ్యక్షులు ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి

భైంసా రూరల్ జనం సాక్షి అక్టోబర్ 07

నిర్మల్ జిల్లా బైంసా వ్యవసాయ మార్కెట్ లో దాదాపు రెండు కోట్ల 30 లక్షలతో నిర్మించనున్న దుకాణ సముదాయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని వ్యవసాయంలో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడవడానికి సహాయపడుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబు వైస్ చైర్మన్ జెకె పటిల్ మాజీ AMC చైర్మన్ కృష్ణ మరియు బైంసా పట్టణ అధ్యక్షులు ఎండి ఫారుక్ అహ్మద్,PACS చైర్మన్ దేవందర్ రెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శి తోట రాము BRS సీనియర్ నాయకులు ప్రసంజీత్ అగ్రే మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.