మండలి గౌరవాన్ని కాపాడుతా: షరీఫ్
అమరావతి,ఫిబ్రవరి7(జనంసాక్షి): ఎపి శాసన మండలి చైర్మన్గా టిడిపి సీనియర్ నేత ఎంఎ.షరీఫ్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో షరీఫ్ ఏకగ్రీవం అయినట్లు మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. షరీఫ్ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. శాసన మండలి గౌరవం పెరిగేలా పని చేస్తానని, సభ సజావుగా నడిచేలా చూస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రులంతా షరీఫ్కు పుష్పగుచ్ఛాలందించి అభినందించారు.