మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

వీర్నపల్లి, అక్టోబర్ 02 (జనంసాక్షి): ఆదివారం రోజున ఎంపిపి మాలోతు భూల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, ఎంపిటిసి కో ఆప్షన్ ఉస్మాన్, గ్రామ సర్పంచ్ పాటి దినకర్, బిఆర్ఎఎస్ మహిళ విభాగం మండల అధ్యక్షురాలు గుగులోతు కళ, ఎంపిడిఒ నరేష్, బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు గుగులోతు శ్రీరామ్, మాజీ ఎఎంసి వైస్ చైర్మన్ నీలం రాజేష్, సీనియర్ నాయకులు హన్మండ్లు, సంతోష్, తిరుపతి, చంద్రయ్యలు పాల్గొన్నారు.