మణిపాల్ వైద్యవిద్యార్థినిపై అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్టు
మణిపాల్ : కేరళకు చెందిన మణిపాల్ యూనివర్శిటీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం కేసులో మణిపాల్ పోలీసులు ముగ్గురు నిందితుల్లో ఇద్దర్ని అరెస్టు చేశారు. నిందితులను కనిపెట్టడానికి పోలీసులు దాదాపు 9వేల మంది ఆటోడ్రైవర్లను విచారించారు. నిందితుల సమాచారం ఇచ్చినవారికి రూ. 2లక్షల బహుమతిని కూడా పోలీసులు ప్రకటించారు. వైద్యవిద్యార్థిని ఆస్పత్రిలో కోలుకుంటోందని వారు తెలిపారు.