మద్దూర్ ఎస్సైగా సి. సురేష్ గౌడ్

మద్దూర్ ఎస్సైగా సి. సురేష్ గౌడ్

మద్దూరు అక్టోబర్ 5 (జనం సాక్షి)మద్దూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్ ఐ గా పి. సురేష్ గౌడ్ గురువారం బాధ్యతలు చేపట్టారు . గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఎస్ ఐ శ్రీనయ్య నారాయణపేట ఎస్పీ కార్యాలయం వి. ఆర్. కు బదిలీ అయ్యారు . అక్కడే పని చేస్తున్న ఎస్సై సి. సురేష్ గౌడ్ మద్దూరు పోలీస్ స్టేషన్ కు ఎస్సైగా బదిలీ అయ్యారు .
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ సురేష్ గౌడ్ మాట్లాడుతూ మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని కోరారు . అందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చే పిర్యాదుదారులకు సమన్వయం అందిస్తూ, శాంతి భద్రతలు పరిరక్షించడానికి కృషి చేస్తానని అన్నారు . చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తప్పని హెచ్చరించారు . మత్తు పదార్థాల క్రయవిక్రయాలు జరిగినట్లు గాని , అక్రమ మద్యం సరఫరా జరుగుతున్నట్లుగాని , ఎవరి దృష్టికి వచ్చిన తమకు సమాచారం ఇవ్వాలని , సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు