మద్యనిషేధం కోరుతూ మహిళల పాదయాత్ర

బెంగళూరు,జనవరి28(జ‌నంసాక్షి): కర్నాటకలో సంపూర్ణ మద్య నిషేధాన్ని కోరుతూ సుమారు 2,500 మంది మహిళలు 200 కిలోవిూటర్ల పాదయాత్ర చేపట్టారు. మాండ్య, మైసూరు, రామనగర, చామరాజనగర, తుమకూరుకు చెందిన ఈ మహిళలంతా ఆదివారం తుమకూరు సవిూపంలోని సిద్దగంగ మఠానికి చేరుకున్నారు. బీరు వద్దు..నీరు కావాలి అన్న నినాదంతో మద్య నిషేధ ఆందోళన ఆధ్వర్యంలో యాత్ర జనవరి 19న చిత్రదుర్గ నుంచి ప్రారంభమైంది. మార్గ మధ్యంలో తగిలే గ్రామాల ప్రజలకు మద్యం మహమ్మారి వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ ఈ మహిళా యాత్ర సాగుతోంది. బుధవారం రాష్ట్ర రాజధానికి చేరుకోనున్న ఈ యాత్ర విధాన సౌధ ముట్టడికి ప్రయత్నిస్తుంది.