మధ్యప్రదేశ్ డిప్యూటి స్పీకర్ హర్వాన్ష్ సింగ్ కన్నుమూత
భోపాల్, జనంసాక్షి: మధ్యప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత హర్వాన్ష్ సింగ్ (65) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.