మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఎంపీడీఓ.

నెన్నెల, ఫిబ్రవరి 16, (జనంసాక్షి )
నెన్నెల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో గురువారం ఎంపీడీఓ వరలక్ష్మి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఆమె నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. వంటలు రుచికరంగా ఉండాలని సూచించారు. ఆమె వెంటనే ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో నరేష్,ఉపాధ్యాయులు ఉన్నారు.