మన యూత్ వారి గణేష్ శోభయాత్ర

మన యూత్ వారి గణేష్ శోభయాత్ర

రాయికల్,సెప్టెంబర్29
(జనం సాక్షి)
పట్టణంలోని కోరుట్ల క్రాస్ రోడ్ నందు డాక్టర్ సదుల సంతోష్,విద్యాసాగర్ అధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథున్ని ఎంతో భక్తి శ్రద్దలతో గణేశుని శోభయాత్ర నిర్వహించడం జరిగింది.ఈసందర్బంగా మన యూత్ వ్యవస్థాపకులు సంతోష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా వినాయకుడి నవరాత్రులు పూజలు నిర్వహించి ఎంతో భక్తి శ్రద్దలతో పాటలు పాడుకుంటూ, కోలాటం ఆడుతూ, కేరింతలు కొడుతూ బై బై గణేశా అంటూ ప్రశాంతంగా శోభ యాత్ర నిర్వహించడం జరిగిందని అన్నారు.అలాగేరాయికల్ పట్టణ ప్రజలపై వినాయకుడి ఆశీస్సులు ఉండాలని ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని కోరుకోవడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మన యూత్ సభ్యులు,భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.