మమత నివాసం ఎదుట మహిళల ఆందోళన

కోల్‌కతా ,(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనీర్జ నివాసం ఎదుట ఆందోళనకు దిగిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 పరగణాల జిల్లా బరసాత్‌ లో జరిగిన బాలికలపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ ‘నారీ మైత్రి’ మహిళా సంఘం సభ్యులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలని నినావాలు చేస్తూ ప్లకార్టులు ప్రదర్శించారు. ఈ సందర్బంగా 13 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.