మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు

అల్వాల్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం కనాజీ గూడ లో వెలసిన ప్రపంచంలోనే అరుదైన పచ్చ ఎమరాల్డ్ తో మల్చిన శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో సువర్ణ పుష్పార్చన గావించిన డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి. దర్బార్ సేవలో అన్న ప్రసాద వితరణకు తోడ్పాటు అందించిన విరాళాల అన్నదాత లకు ఆలయ మర్యాదలతో వారికి సన్మానించి గోత్రనామాలతో ప్రత్యేక అర్చన లు చేస్తారు. నీరాటంకంగా అన్నప్రసాద వితరణ చేస్తున్న ఏకైక ఆలయం అంటే మరకత శ్రీలక్ష్మీ గణపతి ఆలయం. ఆలయ అభివృద్ధికి అన్న ప్రసాద్ వితరణకు విరాళాలు అందించాలంటే ఆలయ కార్యాలయంలో సంప్రదించవచ్చని ఆయన భక్తులకు కోరారు. చిలకలగూడ చౌరస్తాలో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ వద్ద అన్నప్రసాదరణ జరుగుతుందని అన్నార్తులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రియ భక్తులు తదితరులు పాల్గొన్నారు