మరికొందరి నేతలతో భేటీ కానున్నా సీఎం

న్యూఢిల్లీ : అధిష్ఠానం పిలుపుతో నిన్న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రెండో రోజు కూడా పలువురు నేతలతో భేటీ కానున్నారు. నిన్న పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీనియర్‌ నేతలు ఆజాద్‌, దిగ్విజయ్‌ సింగ్‌లతోపాటు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో సీఎం భేటీ అయి తెలంగాణ అంశంతోపాటు రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించారు.