మరో కులాంతర వివాహ బలి
దూరంగా ఉంటున్న జంటను పట్టుకుని కావేరీలో తోసారు
శవాలు తేలడంతో బయటపడ్డ తండ్రి పన్నాగం
చెన్నై,నవంబర్17(జనంసాక్షి): మరోదారుణం జరిగింది. పరవు హత్యకు తల్లిదండ్రులే పూనుకున్నారు. ముచ్చటగా ఉన్న జంగటను కిరాతకంగా కడతేర్చారు. అమ్మాయిది అగ్ర కులం.. అబ్బాయిది తక్కువ కులం.. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ అమ్మాయి తల్లిదండ్రులు.. ఈ ప్రేమికుల వివాహాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆ నవ దంపతులను కావేరీ నదిలో తోసేసి హత్య చేశారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన నందీష్(26), స్వాతి(19) గత కొంతకాలం నుంచి ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు కావడంతో నందీష్, స్వాతి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మూడు నెలల క్రితం నందీష్, స్వాతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక తమిళనాడులో ఉండకుండా.. కర్ణాటకలోని మాండ్యా పోలీసు స్టేషన్ పరిధిలో నవ దంపతులు ఉంటున్నారు. అయితే కమల్ హాసన్ విూటింగ్ నవంబర్ 10న ¬సూర్లో ఉండడంతో నందీష్, స్వాతి అక్కడికి వెళ్లారు. ఇక్కడ స్వాతి దూరపు బంధువు వీరిని చూసి ఆమె తండ్రికి సమాచారం అందించాడు. అప్పటికే ¬సూర్లో ఉన్న స్వాతి తండ్రి తన బంధువులతో అక్కడికి చేరుకొని నవ దంపతులను పట్టుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తానికి నవంబర్ 11న తెల్లవారుజామున 3 గంటల సమయంలో నందీష్, స్వాతి కాళ్లు, చేతులు కట్టేసి శివణసముద్ర వద్ద కావేరీ నదిలో తోసేశారు. అయితే రెండు రోజుల తర్వాత వీరి మృతదేహాలు నీటిపై తేలియాడడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడు శ్రీనివాస్(స్వాతి తండ్రి)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరాన్ని తానే చేసినట్లు శ్రీనివాస్ పోలీసుల ఎదుట అంగీకరించాడు.