మల్లారాజిరెడ్డి, రాంచంద్రారెడ్డి సేఫ్‌

` మావోయిస్టు పార్టీ ప్రకటన
హైదరాబాద్‌(జనంసాక్షి):భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్‌ నాయకులు కామ్రేడ్స్‌ మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్‌), కట్టా రామచంద్రా రెడ్డిలు మరణించినట్టుగా ఆగస్టు 19న తెలుగు(జనంసాక్షిలో కాదు..),హిందీ దినపత్రికలలో వచ్చిన అబద్ధపు వార్తా కథనాలను దండకారణ్యంలోని ఉత్తర్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో, భాకపా (మావోయిస్టు) తీవ్రంగా ఖండిరచింది. ఈమేరకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఉత్తర్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో దండకారణ్యం అధికార ప్రతినిధి మంగ్లి పేరుతో ప్రకటన విడుదల చేశారుమీమ ఇద్దరూ నాయకులు క్షేమంగా, సురక్షితంగా వున్నారని వాళ్ల క్షేమసమాచారం కోసం ఆదుర్దాగా ఎదురుచూస్తున్న యావత్తు విప్లవ ప్రజానీకానికీ, సంస్థలకు, వాళ్లిద్దరి కుటుంబ సభ్యులకూ, బంధు మిత్రులకూ తెలియజేస్తున్నామన్నారు. ప్రజలను అయోమయంలో ముంచెత్తడానికి, విప్లవ విజయం పట్ల అవిశ్వాసం కల్గించడానికి, మా నాయకుల ఆనుపానులు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో, పోలీసు, ఇంటెలిజెన్స్‌ వున్నత అధికారుల కనుసన్నలలో పార్టీ నాయకుల అనారోగ్యాల పట్ల తరచూ విూడియాలో అబద్ద ప్రచారం చేస్తున్నారు. ఇది తమ పార్టీకి వ్యతిరేకంగా పాలక వర్గాలు చేపట్టిన మానసిక యుద్ధంలో భాగమేనన్నారు. పాలక వర్గాలు చేసే ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని మేము ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు.