మల్లికార్జున్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎస్వీ నందు

: మల్లికార్జున నగర్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జిహెచ్ఎంసి ఎంప్లాయ్ ఎస్వి నందు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నేడు జరిగిన ఎన్నికల్లో భాగంగా  184 ఓట్లకు గాను  167 ఓట్లు పోలయ్యాయి. హోరాహోరీగా జరిగిన  పోలింగ్లో  అందులో పోటీ చేసిన అభ్యర్థులు  పరమేశ్వర్ రెడ్డి గారికి  76 ఓట్లు పోలవ్వాగా, నందు గారికి 91 ఓట్లు వచ్చాయి. జరిగిన టఫ్ ఫైట్ లో 15 ఓట్ల తో  ఎస్వి నందు అన్న గారు గెలుపొందారు.ఎవరు గెలుపొందిన  కాలనీ అభివృద్ధి కొరకు అందరు కలిసి సమిష్టిష్టంగా  పనిచేస్తామని  అన్నారు. కాలనీ అభివృద్ధి లక్ష్యంగా కాలనీ వాస్తవ్యులందరం   కలిసి మన సమస్యల పరిష్కరించుకుందామని నూతన అధ్యక్షుడు  ఎస్వీ నందు అన్నారు. కొత్త పాత అని తేడా లేకుండా  కలిసికట్టుగా అందరి ముందుకు సాగుదాం అని తెలిపారు. నాపై నమ్మకం ఉంచి తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా రుణపడి ఉంటానని  కాలనికి సేవ చేయడం   ఎంతో భాగ్యమని తెలిపారు.