మళ్లీ టిడిపిదే అధికారం
కెటిఆర్ వ్యాఖ్యలపై మంత్రి గంటా
విశాఖపట్టణం,ఫిబ్రవరి24(జనంసాక్షి): ఏపీలో టీడీపీ 100 శాతం ఓడిపోతుందని చెప్పిన కేటీఆర్ జోస్యంపై మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ జోస్యం ఫలించదు. కచ్చితంగా మళ్లీ టీడీపీదే గెలుస్తుందని మంత్రి గంటా అన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కేటీఆర్ దృష్టి పెడితే మంచిదన్నారు. విశాఖ ప్రధాని మోదీ పర్యటనకు ప్రజల నుంచి నిరసనలు తప్పవని చెప్పారు. విశాఖ పర్యటనలో మోదీ రైల్వేజోన్ ప్రకటన చేసినా ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. క్లాసులు కొనసాగుతున్నాయి. ఏయూ గ్రౌండ్లో సభలకు అనుమతిలేదని మంత్రి పేర్కొన్నారు.