మళ్లీ రెచ్చిపోయిన మావోలు

ఛత్తీస్‌ఘడ్‌లో కాంట్రాక్టర్‌ హత్య

రాయ్‌పూర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు మరోసారి రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలో ఓ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్‌ను హతమార్చి, ఆరు వాహనాలు దగ్ధం చేశారు. డోర్నాపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నిర్మాణంలో ఉన్న మిస్మా-చిచోర్‌గూడ రోడ్డుపై ఈ ఘటన జరిగినట్టు సుక్మా ఎస్పీ అభిషేక్‌ విూనా వెల్లడించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన పథకం కింద ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. సాము మహమ్య బిల్డ్‌కాన్‌ కంపెనీ యజమాని, కాంట్రాక్టర్‌ హరిశంకర్‌ సాహు ఈ కాంట్రాక్టు దక్కించుకున్నారు. రోడ్డు నిర్మాణ పనులను ఆపేయాలంటూ దాదాపు డజనుమందికి పైగా నక్సలైట్లు కార్మికులపై దాడికి పాల్పడినట్టు ఎస్పీ పేర్కొన్నారు. సాహుపై పదునైన ఆయుధాలతో దాడిచేసి అక్కడి నుంచి పరారయ్యారనీ… దీంతో సాహు అక్కడికక్కడే మృతి చెందారని ఆయన వెల్లడించారు. వెళ్తూ వెళ్తూ సాహు ఎస్‌యూవీ కారుతో పాటు మరో ఐదు వాహనాలు, నిర్మాణ యంత్రాలకు మవోయిస్టులు నిప్పు పెట్టినట్టు ఎస్పీ విూనా వెల్లడించారు. నక్సల్స్‌ దాడిలో గాయపడిన ముగ్గురు కార్మికులకు సవిూప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. మరోవైపు దాడికి పాల్పడిన నక్సలైట్ల కోసం భద్రతా దళాలు భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి.