మహనీయుల త్యాగం మరువలేనిది.

మహనీయుల త్యాగం మరువలేనిది.

తాండూరు అక్టోబర్ 2( జనం సాక్షి) మహనీ యుల త్యాగం మరువలేనిదని తాండూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మఠం చంద్రశేఖర్ పేర్కొన్నారు.సోమవారం తాండూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ మరియు మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జన్మదినం సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయులు చూపిన సన్మార్గంలో నడుచుకుందామన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి రవికుమార్, సీనియర్ న్యాయవాదులు నర్సింలు, గోపాల్, విశ్వనాథ్ తదితరులు ఉన్నారు.