మహాత్మాగాంధీ అనుసరించిన మార్గం అన్ని తరాలకు ఆదర్శప్రాయం..!

మహాత్మాగాంధీ అనుసరించిన మార్గం అన్ని తరాలకు ఆదర్శప్రాయం..!

సంగెం: అక్టోబర్ 02 (జనం సాక్షి)
కోట్లాదిమంది ప్రజలు కుల,మతాలకు అతీతంగా పూజించే వ్యక్తి మహాత్మాగాంధీ అని సంగెం మండల ఎంపిపి కందగట్ల కళావతి నరహరి అన్నారు.సోమవారం రోజున సంగెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధి,లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం ఘనముగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఎంపిపి కళావతి మాట్లాడుతూ…కోట్లాదిమంది ప్రజలు కుల,మతాలకు అతీతంగా పూజించే వ్యక్తి గాంధీ అని అన్నారు. అహింసా మార్గంలో స్వతంత్ర సంగ్రామాన్ని నడిపించిన యోధుడు మహాత్మా గాంధీ అని అన్నారు.అలానే లాల్ బహదూర్ శాస్త్రి వితాంతం విలువలకే కట్టుబడిన జననేత,చేతిలో దేశ ప్రధాని,కేంద్ర హోం శాఖ మంత్రి వంటి అత్యున్నత పదవులు ఉన్న,ఎలాంటి హంగులు,ఆర్భాటాలకు పోకుండా ఊపిరి ఉన్నంత కాలం అతి సాధారణ జీవితమే గడిపిన ఒక మహానేత ఎవరైనా ఉన్నారా అంటే ఆ మహానీయుడే ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి అని అది భారతదేశానికి గర్వకారణమని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుండేటి బాబు,మెట్టుపల్లి మల్లయ్య,వైస్ ఎంపిపి బుక్క మల్లయ్య,పిఏసియస్ చైర్మన్ కుమారస్వామీ,ఎంపిడిఓ వెంకటేశ్వరావు,నాయకులు పులి విరస్వామీ,కోడూరి సదయ్య,మునుకుంట్ల మోహన్,కోటి,ఇప్పకాయల మనోహర్,కుమారస్వామీ,తదితరులు పాల్గొన్నారు.