మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళి- తల్లి దివ్యంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు టిఆర్ఎస్ నాయకుడు గజ్జి శంకర్

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళి- తల్లి దివ్యంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు టిఆర్ఎస్ నాయకుడు గజ్జి శంకర్

 జనగామ ప్రతినిధి (జనంసాక్షి)అక్టోబర్2: దేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి ఎదురిచ్ఛి జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు నడుంబించాలన్నారు. ఈ సందర్భంగా గజ్జి శంకర్ నివాళులు అర్పిస్తూ గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం పాలకులు కృషి చేయాలని కోరారు.సత్యం, అహింస ద్వారా హక్కులను సాధించుకోవచ్చని.. ఇదే ఉత్తమమైన మార్గమని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయ మూర్తి మహాత్మా గాంధీ. ప్రపంచవ్యాప్తంగా ఆయన సిద్ధాంతాల పట్ల స్ఫూర్తిపొంది ఉన్నతంగా ఎదిగిన వారు ఎంతోమంది. స్వాతంత్ర్య భారతం ఇలా ఉండాలి అని గాంధీజీ కన్న కలలను మన గ్రామాలు నేడు స్వయం సమృద్ధితో, స్వయం పాలనతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి అని తెలిపారు.