మహారాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం… 10 మంది మృతి

థానే : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. థానే జిల్లా కాసా వద్ద ఈ ఉదయం బస్సు, ట్యాంకర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.