మహాశివరాత్రికి రంగులతో ముస్తాబవుతున్న శివుడి విగ్రహంమహాశివరాత్రికి రంగులతో ముస్తాబవుతున్న శివుడి విగ్రహం


మల్దకల్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి)మల్దకల్ జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో బుధవారం నెల 18 న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు బాల గౌడు,వీరేష్ గౌడు,గ్రామ రైతు సమన్వయ సమితి సమితి అధ్యక్షుడు సోమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శివుడి విగ్రహానికి రంగులు వేయించారు. ఈనెల 20న  శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చేభక్తులకు నీటి సౌకర్యాలు, వీధిలైట్లు గ్రామాల్లో చేయించినట్లు గ్రామ సర్పంచ్ లక్ష్మన్న, పంచాయతి కార్యదర్శి రాజేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు హరినాథ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి,చాకలి వెంకట్ రాములు, శంకరయ్య, లక్ష్మన్న, తిమ్మప్ప, ఫకీరన్న తదితరులు పాల్గొన్నారు.