మహిళ దారుణ హత్య

కర్నూలు,ఫిబ్రవరి12 జ‌నంసాక్షి): శ్రీశైలంలో గంగాసదన్‌ దగ్గర ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సుబ్బమ్మ అనే మహిళను దుండగులు తలపై కొట్టి చంపేశారు. రక్తపు మడుగులో పడిఉన్న మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమెను ఎందుకు చంపారన్నది తెలియాల్సి ఉంది.