మహేష్ తల్లి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన వాకిటి శ్రీధర్

వనపర్తి బ్యూరో సెప్టెంబర్30 (జనంసాక్షి)

తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు దాసరాజు మహేష్ తల్లి మరణం పట్ల జిల్లా అధికార ప్రతినిధి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు దాసరాజు మహేష్ తల్లి మృతి విషయం తెలుసుకున్న బా రా స జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ఆమె మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసి మంత్రి నింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంతక్రియల ఖర్చుల నిమిత్తం పంపిన 5000 వేల రూపాయలను అందచేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కార్యక్రమం లొ వజ్రాల రమేశ్ నాగరాజు రవి తదితరులు పాల్గొన్నారు