మాకు రెండు రైనోలివ్వండి
చెన్నై : అస్సాం ముఖ్యమంత్రి తరుణ్గొగోయ్కి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక లేఖ రాశారు. తమ వాండలూర్ జంతు సంరక్షణ కేంద్రానికి రెండు ఖడ్గమృగాలను ఇవ్వవలసిందిగా కోరారు. బదులుగా తాము అడవిదున్నలను ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. జూ అథారిటీ ఆఫ్ తమిళనాడుకు జయలలిత అధ్యక్షురాలిగా ఉన్నారు. దేశంలోని పెద్దదైన వాండలూర్ అన్నా జూపార్కులో దాదాపు పాతికేళ్లుగా ఖడ్గమృగం లేకపోవడం లోటుగా ఉందని జయ తన లేఖలో పేర్కొన్నారు.