మాకెన్‌, సీపీ జోషి రాజీనామా ఆమోదం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర రైల్వే మంత్రి సీపీ జోషి, గృహ నిర్మాణం, పట్టణ పేదరికం నిర్మూలన శాఖ మంత్రి అజయ్‌ మాకెన్‌ రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదించారు. పార్టీకి సేవ చేసేందుకు వీరిద్దరూ మంత్రి పదవులను వదులుకున్నారు. పార్టీ సేవల కోసం మరికొంత మంది మంత్రులు మంత్రివర్గం నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 17న కేంద్ర మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ జరగనుంది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో కొత్త వారికి అవకాశం అభించనుంది.