మాజీమంత్రి మంజూవర్మ ఆస్తులు సీజ్
పాట్నా,నవంబర్17(జనంసాక్షి): బీహార్లోని మాజీ మంత్రి మంజూ వర్మ ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు. శనివారం ఉదయం భారీ సంఖ్యలో మాజీ మంత్రి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముజఫర్పూర్ షెల్టర్ ¬మ్లో జరిగిన అత్యాచార ఘటనలో మాజీ మంత్రి మంజూ వర్మ భర్త నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధం ఉన్న మాజీ మంత్రి మంజూ వర్మ కొన్నాళ్లుగా ఆచూకీ లేరు. ఆమె కోసం రెండు రోజులగా బీహార్ పోలీసులు గాలిస్తున్నారు. జేడీయూ పార్టీ ఆమెను సస్పెండ్ చేశారు. షెల్టర్ ¬మ్లో ఉన్న సుమారు 32 మంది మైనర్ విద్యార్థినులను రేప్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రిజేశ్ను అరెస్టు చేశారు.