మార్కెట్ కమిటీ డైరెక్టర్ మమ్మద్ ముస్తఫా కు ఘనంగా సన్మానం.

తాండూరు అక్టోబర్ 2( జనం సాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా మహ్మద్ ముస్తఫా పదవి ప్రమాణ స్వీకారం నిర్వహించిన సందర్భంగా ఆయనకు ఘనంగా సన్మానించారు. ఆదివారం తాండూరు పట్టణం తన నివాసంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్ము గోపాల్ రెడ్డి, ఇందోల్ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఇంద్ర నగర్ ముస్తఫా, కురువ చంద్రప్పలతో కలిసి శాలువాతో సన్మానించి ఘనంగా సన్మానించారు.
మరెన్నో ఉత్తమ పదవులు అధిరోహించాలని
అభినందిస్తూ శుభకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.