మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉమాశంకర్ ను సన్మానించిన నేతలు. ఉపాధ్యాయులు.

తాండూరు అక్టోబర్ 2(జనం సాక్షి) తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా పదవి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించిన సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉమా శంకర్ ను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆదివారం తాండూర్ పట్టణం తన నివాసంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు వివిధ మండలాలకు చెందిన నాయకులు, ఉపాధ్యాయులు కలిసి
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉమాశంకర్ ను ఘనంగా సన్మానించారు. ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని మనసారా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉపాధ్యాయులు మిత్రులు తదితరులు ఉన్నారు.