మాలమానాడు నియోజకవర్గ అధ్యక్ష పదవిని ఖండిస్తున్నాం.

మాలమానాడు నియోజకవర్గ అధ్యక్ష పదవిని ఖండిస్తున్నాం.

నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షులు పటేల్ కృష్ణయ్య.
తాండూరు సెప్టెంబర్ 29(జనంసాక్షి) మాల మానాడు నియోజకవర్గ అధ్యక్షునిగా కోనాపూర్ గ్రామానికి చెందిన మాల నరేష్ వీరి నియామక పత్రాలు పదవులను తీవ్రంగా ఖండిస్తున్నామని తాండూర్ నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షులు పటేల్ కృష్ణయ్య తెలిపారు.మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడిగా నరేష్ మండల అధ్యక్షునిగా నర్సిములు నియామకం కావడం ఆశ్చర్యకరం ఎవరికి కూడా గుర్తు లేరు. సంఘంలో కార్యక్రమాలకు పని దాఖలాలు కూడా లేదన్నారు..అధ్యక్షులు అని చెప్పుకోవడం సిగ్గుచేటు దీని మేము తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. వీరిపై సంఘం తరపున చర్యలు తీసుంటామన్నారు. ముందు ముందు ఎవరైనా సరే సంఘంలో పనిచేయాలంటే అందర్ని కలుపుకొని పోయి పదవులను ఆశించాల న్నారు. సంఘం అనేది ఒక జాతి నిర్మాణం ఏర్పాటు చేయడానికి ఈ సంఘాన్ని నిర్మాణం చేస్తున్నాం ఈ సంఘానికి కూడా అందరు మాల సోదరులు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా పనిచేయాలని ఆయన సూచించారు. సంఘం లో మంచిగా పని చేసి వ్యక్తులు ముందు రావాలని కోరుతున్నారు. ఏ రాజకీయ నాయకులకు ఈ సంఘం తొత్తు కాదు జాతి నిర్మాణం కోసమే ఇది పనిచేస్తుందన్నారు. కాబట్టి దీనిని అందరం కలిసి ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర నాయకులు పురుషోత్తం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నిరటి హనుమంతు, తాండూర్ మండల అధ్యక్షులు మల్లప్ప, యాలాల్ మండల అధ్యక్షులు శేఖర్.గోటిగా నర్సింలు .హె.గోపాల్.రాములు.బుగ్గప్ప. తదితరులు పాల్గొన్నారు.