ముంబయిలో కూలిన రెండంతస్థుల భవనం

ముంబయి: ముంబయిలోని భివాండిలో రెండంతస్థుల భవనం కూలింది. ఈ ప్రమాదంలో మున్నా వజూర్‌ దివాన్‌ (25) అనే కార్మికుడు మృతి చెందాడు. మరో13 మంది గాయాలపాలయ్యారు. విపత్తు నిర్వహణ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన భవనంలో దుస్తుల తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నారు.